మాస్కులు ధరించనందుకు షాప్స్ సీజ్‌

ABN , First Publish Date - 2021-04-13T01:49:09+05:30 IST

ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తున్న వారిపై జిల్లా అధికారులు కొరడా ఝలిపించారు.

మాస్కులు ధరించనందుకు షాప్స్ సీజ్‌

సంగారెడ్డి: ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తున్న వారిపై జిల్లా అధికారులు కొరడా ఝలిపించారు. తాజాగా ఆందోల్-జోగిపేట మున్సిపాలిటీలో దుకాణాలను సీజ్ చేశారు. మున్సిపాలిటీలోని వ్యాపార సముదాయాలలో మాస్కులు ధరించకుండా రెండు మొబైల్ దుకాణాల యజమానులు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అధికారులు గుర్తించి ఆ రెండు మొబైల్ షాప్స్‌ను సీజ్‌ చేశారు. దీంతో అధికారులతో దుకాణాల యజమానులు వాగ్వాదానికి దిగారు. 

Updated Date - 2021-04-13T01:49:09+05:30 IST