పాకిస్థాన్లో కిడ్నాప్కు గురైన సిక్కు యువతి.. మరుసటి రోజు ట్విస్ట్!
ABN , First Publish Date - 2020-09-21T06:43:18+05:30 IST
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో 22 ఏళ్ల సిక్కు యువతి కిడ్నాప్కు
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో 22 ఏళ్ల సిక్కు యువతి కిడ్నాప్కు గురైనట్టు అక్కడి పోలీసు అధికారులు వెల్లడించారు. అటోక్ జిల్లాలోని హస్సానాబ్దల్ నగరంలో యువతి కిడ్నాప్కు గురైందని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెత్తను పడేయడానికి యువతి బయటకు వెళ్లి ఎంతసేపు గడిచినా తిరిగి ఇంటికి వెళ్లలేదు. దీంతో యువతి తండ్రి తన కూతురు అదృశ్యమైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉంటే.. మరుసటి రోజు యువతి తన తండ్రి వాట్సాప్కు మెసేజ్ చేసింది. తన ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుంటున్నానని.. సిక్కు మతం నుంచి ముస్లింగా మారుతున్నట్టు మెసేజ్లో చెప్పుకొచ్చింది. తన కూతురును బలవంతంగా కిడ్నాప్ చేసి మతమార్పిడి చేస్తున్నారంటూ యువతి తండ్రి పోలీసులకు వివరించాడు. అనేక పోలీస్ టీమ్స్ యువతి ఆచూకీ కోసం గాలిస్తున్నాయని సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ హస్సాన్ చెప్పారు. యువతి ఆచూకీ లభ్యమైన వెంటనే ఆమెను కోర్టు ఎదుట హాజరుపర్చనున్నట్టు తెలిపారు.