అనంతపురం: శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో వెండి చోరీ
ABN , First Publish Date - 2020-07-25T16:08:34+05:30 IST
అనంతపురం: బ్రహ్మసముద్రం మండలంలోని గొంచిరెడ్డిపల్లి గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో వెండి చోరీకి గురైంది.
అనంతపురం: బ్రహ్మసముద్రం మండలంలోని గొంచిరెడ్డిపల్లి గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో వెండి చోరీకి గురైంది. గొంచిరెడ్డిపల్లి గ్రామ శివారులో బ్రహ్మసముద్రం వెళ్లే ప్రధాన రహదారి పక్కన పాత నరసింహ స్వామి దేవాలయంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు స్వామివారి మూల విరాట్ దగ్గర ఉంచిన దాదాపు రెండున్నర నుంచి మూడు కేజీల వెండి సామగ్రిని అపహరించినట్టు గ్రామస్తులు తెలిపారు.