కేసీ కెనాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి గల్లంతు
ABN , First Publish Date - 2021-08-21T23:53:05+05:30 IST
జిల్లాలోని నందికొట్కూరు మండలం కొణిదేల గ్రామంలో విషాదం నెలకొంది. సాఫ్ట్వేర్
కర్నూలు: జిల్లాలోని నందికొట్కూరు మండలం కొణిదేల గ్రామంలో విషాదం నెలకొంది. సాఫ్ట్వేర్ ఉద్యోగి లక్ష్మీకాంత్ రెడ్డి( 40), తన పుట్టినరోజే కేసి కెనాల్లో గల్లంతయ్యాడు. కెనాల్లో కాళ్ళు కడుక్కోవడానికి వెళ్లిన పిల్లలను లక్ష్మీకాంత్ రెడ్డి కాపాడాడు. కేసి కెనాల్లో నీళ్లు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో జారిపడి కాలువలో లక్ష్మీకాంత్ రెడ్డి గల్లంతయ్యాడు. లక్ష్మీకాంత్ రెడ్డి ఆచూకీ కోసం అధికారులు, గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టారు.