పాలవ్యాన్‌-లారీ ఢీ.. ఒకరి దుర్మరణం

ABN , First Publish Date - 2021-03-03T05:49:18+05:30 IST

పాలవ్యాన్‌-లారీ ఢీ.. ఒకరి దుర్మరణం

పాలవ్యాన్‌-లారీ ఢీ.. ఒకరి దుర్మరణం
వ్యాన్‌ క్యాబిన్‌ నుంచి మృతదేహాన్ని బయటకు తీస్తున్న పోలీసులు

యాచారం: పాల వ్యాన్‌, మొక్కజొన్న కంకుల లారీ ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం మంగళవారం ఉదయం 6గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా కారంపూడి మండలం తాటిగోనెపల్లికి చెందిన దారి వేముల సురేష్‌(28), అదే గ్రామానికి చెందిన కాల్వ సురేష్‌(29) పాలవ్యాన్‌(టీఎస్‌08 యూహెచ్‌7406)లో కారంపూడి నుంచి పాలు తెచ్చి నగరంలో విక్రయించి తిరిగి వెళ్తున్నారు. నాగార్జునసాగర్‌-హైదరాబాద్‌ రోడ్డుపై గున్గుల్‌ వ్యవసాయ పరిశోధన కేంద్రం సమీపంలో మాల్‌ వైపు నుంచి నగరానికి మొక్కజొన్న కంకుల లోడ్‌తో వెళ్తున్న లారీ(ఏపీ28 యూ 9109) డ్రైవర్‌ ఎండీ ఇబ్రహీం(28) నిర్లక్షంగా నడిపి పాలవ్యాన్‌ను ఢీకొట్టాడు. వ్యాన్‌ డ్రైవర్‌ దారి సురేష్‌(28) క్యాబిన్‌లో ఇరుక్కొని మృతిచెందాడు. ఎస్సై ప్రభాకర్‌ మృతదేహాన్ని బయటకు తీయించారు. సురే్‌షను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ ఇబ్రహీం పోలీసులకు లొంగిపోయాడు. మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయించినట్టు ఎస్సై తెలిపారు.

Updated Date - 2021-03-03T05:49:18+05:30 IST