ఆ మహిళలకు వేగంగా వైద్యం అందించాలి: సోమువీర్రాజు

ABN , First Publish Date - 2022-08-03T13:40:43+05:30 IST

అనకాపల్లి బ్రాండిక్స్‌లో రసాయన వాయువు లీక్‌తో అస్వస్థతకు గురైన మహిళలకు వేగంగా వైద్యం అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు డిమాండ్ చేశారు.

ఆ మహిళలకు వేగంగా వైద్యం అందించాలి: సోమువీర్రాజు

విజయవాడ: అనకాపల్లి బ్రాండిక్స్‌లో రసాయన వాయువు లీక్‌తో అస్వస్థతకు గురైన మహిళలకు వేగంగా వైద్యం అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు డిమాండ్ చేశారు. రెండు మాసాల వ్యవధిలో రెండు పర్యాయాలు రసాయనాలు లీక్ అయ్యాయన్నారు. ప్రభుత్వం తోలు మందంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. పరిశ్రమల పై ప్రభుత్వం పర్యవేక్షణ విరమించుకుందా? అని ప్రశ్నించారు. కార్మికులు అస్వస్థతకు గురైతే ప్రభుత్వం ఏం చేస్తోందంటూ సోమువీర్రాజు విసుర్లు విసిరారు. స్థానిక కార్యకర్తలు కార్మికులకు అండగా ఉండాలని సూచించారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి అత్యవసర ప్రకటన విడుదల చేశారు. 


Updated Date - 2022-08-03T13:40:43+05:30 IST