ఏపీలో దుర్మార్గమైన పరిపాలన: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2022-01-02T18:26:33+05:30 IST

ఏపీలో దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆదివారం కొవ్వూరులో పర్యటించారు.

ఏపీలో దుర్మార్గమైన పరిపాలన: సోము వీర్రాజు

ఏలూరు: ఏపీలో దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆదివారం కొవ్వూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం నిధులు ఇస్తుంటే జగన్ తన సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. రాష్ట్రాన్ని ఆదాయ వనరులుగా చేసుకుని జగన్ ప్రభుత్వం దోచుకుంటుందని మండిపడ్డారు. సినిమా టికెట్లు విషయంలో ప్రభుత్వ జోక్యం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చేరవేసేందుకు బీజేపీ తరపున మండల స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారని సోము వీర్రాజు చెప్పారు. 

Updated Date - 2022-01-02T18:26:33+05:30 IST