నకిలీ మద్యం తయారీ కేంద్రంపై ఎస్వోటీ పోలీసుల దాడులు
ABN , First Publish Date - 2020-07-17T16:35:00+05:30 IST
శంషాబాద్: శంషాబాద్ నకిలీ మద్యం తయారీ కేంద్రంపై ఎస్వోటీ పొలీసుల దాడులు నిర్వహించారు.
శంషాబాద్: శంషాబాద్ నకిలీ మద్యం తయారీ కేంద్రంపై ఎస్వోటీ పొలీసుల దాడులు నిర్వహించారు. లిక్కర్తో పాటు ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా మద్యం తయారు చేస్తున్న పెనుమచ్చ విజయ్ కుమార్ను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యాన్ని సీజ్ చేసి స్థానిక శంషాబాద్ పొలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పొలీసులు దర్యాప్తు చేస్తున్నారు.