ఓటు వేసిన సౌరవ్ గంగూలీ
ABN , First Publish Date - 2021-04-10T22:04:12+05:30 IST
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్లో భాగంగా బీసీసీఐ..
సౌత్ 24 పరగణాలు: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్లో భాగంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శనివారంనాడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సౌత్ 24 పరగణాలు జిల్లా బరీషా శశిభూషణ్ జనకల్యాణ్ విద్యాపీఠ్లోని పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు.
నాలుగో విడత పోలింగ్లో భాగంగా 5 జిల్లాల్లోని 44 నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్ జరుగుతోంది. వీటిలో 9 నియోజకవర్గాలు హౌరాలో, హుగ్లీలో 10, సౌత్ 24 పరగణాలలో 11, అలిపూర్దూర్లో 5, కూచ్బెహర్లో 9 నియోజకవర్గాలు ఉన్నాయి. ఐదో విడత పోలింగ్ ఏప్రిల్ 17న జరుగనుంది.