దక్షిణాఫ్రికా ‘ఎ’ 343/3
ABN , First Publish Date - 2021-11-24T08:52:08+05:30 IST
భారత్ ‘ఎ’ జట్టుతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో దక్షిణాఫ్రికా ‘ఎ’ అదరగొడుతోంది. కెప్టెన్ పీటర్ మలాన్ (157 నాటౌట్), టోనీ డి జోర్జి (117)
బ్లూమ్ఫోంటీన్: భారత్ ‘ఎ’ జట్టుతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో దక్షిణాఫ్రికా ‘ఎ’ అదరగొడుతోంది. కెప్టెన్ పీటర్ మలాన్ (157 నాటౌట్), టోనీ డి జోర్జి (117) శతకాలతో రాణించారు. దీంతో తొలి రోజు మంగళవారం ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 3 వికెట్లకు 343 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొన్న మలాన్, జోర్జి మూడో వికెట్కు 217 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సైనీ, అర్జాన్, ఉమ్రాన్లకు ఒక్కో వికెట్ దక్కింది.