వంద శాతం సబ్సిడీతో చేప పిల్లల పంపిణీ గర్వకారణం: పోచారం

ABN , First Publish Date - 2021-09-17T23:11:45+05:30 IST

తెలంగాణలోని మత్స్య కారులకు వందశాతం సబ్సిడీతో చేప పిల్లలను అందించడం తెలంగాణకు గర్వకారణమని శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు.

వంద శాతం సబ్సిడీతో చేప పిల్లల పంపిణీ గర్వకారణం: పోచారం

బాన్సువాడ: తెలంగాణలోని మత్స్య కారులకు వందశాతం సబ్సిడీతో చేప పిల్లలను అందించడం తెలంగాణకు గర్వకారణమని శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి  అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత చేప విత్తనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బాన్సువాడ కల్కి చేరువులో ఆయన చేపపిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ 100 శాతం సబ్సిడీతో చేప పిల్లలను మత్స్యకారులకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించలేదన్నారు.


గతంలో ఏదో నామ్ కే వాస్తేగా కొన్ని జిల్లాలో కొన్ని చెరువులకు ఒక్కోదానికి రూ.12,500 చొప్పున ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు, చెరువులు, సాగునీటి వనరులలో రూ. 92 కోట్లతో 100 కోట్ల చేప పిల్లలను ఏటా విడుదల చేస్తుందన్నారు.వీటి విలువ ఏడాదికి పదివేల కోట్ల రూపాయలని ఆయన వెల్లడించారు. కుల వృత్తుల పై ఆధారపడిన వారు గౌరవ ప్రదంగా బతకడానికి  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బారీ సబ్సిడీ లతో పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు.

Updated Date - 2021-09-17T23:11:45+05:30 IST