అక్రమ ఇసుక తరలింపుదారులపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దాడులు
ABN , First Publish Date - 2020-05-28T22:06:24+05:30 IST
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ ఇసుక తరలిస్తున్న వారిపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దాడులు నిర్వహించింది.
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ ఇసుక తరలిస్తున్న వారిపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దాడులు నిర్వహించింది. 24 గంట ల్లోజరిపిన దాడుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 53 కేసులు నమోదు అయ్యాయి. ఈ దాడుల్లో 97 మందిని అరెస్ట్ చేయగా... 57 వాహనాలను అధికారులు సీజ్ చేశారు. 664 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు.