రైతు భూములకు ప్రత్యేక ప్యాకేజీ: మంత్రి గంగుల

ABN , First Publish Date - 2021-07-01T23:03:37+05:30 IST

మానేరు రివర్ ఫ్రంట్‌లో రైతుల భూములకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

రైతు భూములకు ప్రత్యేక ప్యాకేజీ: మంత్రి గంగుల

కరీంనగర్: మానేరు రివర్ ఫ్రంట్‌లో రైతుల భూములకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని  మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.  గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దీనికి సంబంధించిన నివేదికను సీఎం కేసీఆర్‌కు పంపిస్తామన్నారు. విలువైన భూములకు తక్కువ ధర వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. త్వరలో రివర్ ఫ్రంట్ పనులు మొదలు పెడతామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని చెప్పారు. ప్రభుత్వం రైతులకు న్యాయం చేస్తుందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. 

Updated Date - 2021-07-01T23:03:37+05:30 IST