స్పిరిట్ చావులకు పెరిగిన మద్యం ధరలే కారణం: జవహర్
ABN , First Publish Date - 2020-06-02T00:13:28+05:30 IST
స్పిరిట్ చావులకు పెరిగిన మద్యం ధరలే కారణమని టీడీపీ నేత జవహర్ ఆరోపించారు. కశింకోటలో మరణాలకు జగన్రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మద్య నిషేధం పేరుతో మద్యం ధరలను
అమరావతి: స్పిరిట్ చావులకు పెరిగిన మద్యం ధరలే కారణమని టీడీపీ నేత జవహర్ ఆరోపించారు. కశింకోటలో మరణాలకు జగన్రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మద్య నిషేధం పేరుతో మద్యం ధరలను 75శాతం పెంచారని, ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా? అని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న కుటుంబాల్లో మద్యం చిచ్చు పెట్టారని జవహర్ మండిపడ్డారు.