జగన్ ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించారు: శ్రవణ్

ABN , First Publish Date - 2020-07-08T20:02:01+05:30 IST

అమరావతి: సీఎం జగన్ ప్రజావేదికను కూల్చడంతో తన పాలన ప్రారంభించారని మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ పేర్కొన్నారు.

జగన్ ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించారు: శ్రవణ్

అమరావతి: సీఎం జగన్ ప్రజావేదికను కూల్చడంతో తన పాలన ప్రారంభించారని మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ పేర్కొన్నారు. స్మృతివనాన్ని తరలించాలి అని భావిస్తున్నారో లేదో తెలియదన్నారు. అయితే స్మృతివనాన్ని మాత్రం అక్కడే కొనసాగించాలన్నారు. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని పెట్టాలని 30 కోట్లు ఇప్పటికే స్మృతి వనం వద్ద ఖర్చు చేశారని.. కాబట్టి దీన్ని అక్కడే కొనసాగించాలని శ్రవణ్ పేర్కొన్నారు. అంబేద్కర్ చివర రోజుల్లో  బౌద్ధం తీసుకున్నారన్నారు. అమరావతిలో బౌద్ధం విలసిల్లిందన్నారు. స్వరాజ్ మైదానంలో రిమోట్‌తో అంబేద్కర్ విగ్రహాన్ని శంకుస్థాపన చేయడం దారుణమని శ్రవణ్ పేర్కొన్నారు. 


Updated Date - 2020-07-08T20:02:01+05:30 IST