India vs Sri Lanka: తొలి వికెట్ కోల్పోయిన లంక
ABN , First Publish Date - 2021-07-24T02:25:58+05:30 IST
భారత జట్టు నిర్దేశించిన 226 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 35 పరుగుల
కొలంబో: భారత జట్టు నిర్దేశించిన 226 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 35 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అవిష్క ఫెర్నాండోకు సహకరిస్తూ నిదానంగా ఆడుతున్న మినోద్ భానుకను కొత్త కుర్రాడు కృష్ణప్ప గౌతమ్ అవుట్ చేశాడు. 17 బంతులు ఆడిన భానుక 7 పరుగులు చేశాడు. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిశాయి. శ్రీలంక వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. ఫెర్నాండో (28), భానుక రాజపక్ష క్రీజులో ఉన్నారు.