హత్యలకు నిలయాలుగా భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలు: శ్రీధర్ బాబు

ABN , First Publish Date - 2021-06-20T03:10:01+05:30 IST

రాష్ట్రంలో హత్యలకు నిలయాలుగా భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలు మారాయని ప్రభుత్వాన్ని మంథని ఎమ్మెల్యే

హత్యలకు నిలయాలుగా భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలు: శ్రీధర్ బాబు

భూపాలపల్లి: రాష్ట్రంలో హత్యలకు నిలయాలుగా భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలు మారాయని ప్రభుత్వాన్ని మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు విమర్శించారు. కాటారం మండలంలోని గంగారంలో హత్యలకు గురైన కుటుంబాన్ని శ్రీధర్‌బాబు  పరామర్శించారు. మంథని నియోజకవర్గంలో మరోసారి హత్యలు కావడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థలోని లోపాల వల్లే ప్రజల ప్రాణాలు పోతున్నాయని శ్రీధర్‌బాబు ఆరోపించారు. పోలీసు, రెవెన్యూ యంత్రాంగాలు బాధ్యత వహించాలని శ్రీధర్‌బాబు అన్నారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-06-20T03:10:01+05:30 IST