అంబేద్కర్ విగ్రహం కోసం..: వీహెచ్

ABN , First Publish Date - 2020-02-22T20:15:26+05:30 IST

హైదరాబాద్: పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ జయంతి రోజున విగ్రహం పెడితే తీసుకెళ్లి చెత్తకుప్పలో వేశారని..

అంబేద్కర్ విగ్రహం కోసం..: వీహెచ్

హైదరాబాద్: పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ జయంతి రోజున విగ్రహం పెడితే తీసుకెళ్లి చెత్తకుప్పలో వేశారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. శనివారం విహెచ్‌ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్‌తో కలిసి రూ. ఐదు లక్షలు పెట్టి అంబేద్కర్ విగ్రహం చేయించానని, తీసుకొచ్చి విగ్రహం పెట్టడానికి ప్రయత్నిస్తే అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలతో సహా.. అందరి మద్దతు కూడగడుతున్నానని అన్నారు. అంబేద్కర్ విగ్రహం కోసం నేను చేస్తున్న పోరాటం తప్పయితే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. సీఎం కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని, అంబేద్కర్ విగ్రహం తీసుకోవడం చాలా దారుణమన్నారు. ఇది అన్ని వర్గాల ప్రజలను అవమానించినట్టేనని వీహెచ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్‌.రమణ, కోదండరామ్‌, విజయరామారావు, కత్తి వెంకటస్వామి, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-22T20:15:26+05:30 IST