రూ.17తో 116 కిలోమీటర్లు

ABN , First Publish Date - 2021-04-05T06:01:04+05:30 IST

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎలక్ట్రిక్‌ వెహికల్‌ (ఈవీ) స్టార్టప్‌ ప్యూర్‌ ఈవీ మార్కెట్లోకి ఈప్లూటో 7జీ ని విడుదల చేసింది. ఈ స్కూటర్‌ను ఒకసారి చార్జింగ్‌ చేస్తే నిరాటంకంగా 116 కిలోమీటర్లు ప్ర

రూ.17తో 116 కిలోమీటర్లు

  • ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఈప్లూటో

హైదరాబాద్‌:  హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎలక్ట్రిక్‌ వెహికల్‌ (ఈవీ)  స్టార్టప్‌ ప్యూర్‌ ఈవీ మార్కెట్లోకి ఈప్లూటో 7జీ ని విడుదల చేసింది. ఈ స్కూటర్‌ను ఒకసారి చార్జింగ్‌ చేస్తే నిరాటంకంగా 116 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడించింది.  2.5 కిలోవాట్‌ లిథియం బ్యాటరీని ఒకసారి చార్జింగ్‌ చేస్తే కేవలం రూ.15-17 మాత్రమే ఖర్చవుతుందని పేర్కొంది. సాధారణ ఎలక్ట్రిక్‌ వాహనాలకు భిన్నంగా ఈ బ్యాటరీని ఇంట్లోని 10-15 యాంప్‌ ప్లగ్‌తో చార్జింగ్‌ చేసుకోవచ్చు. నాలుగు గంటల్లో పూర్తిగా చార్జింగ్‌ అవుతుందని పేర్కొంది.  పేటెంటెడ్‌ బ్యాటరీ సాంకేతికతో రూపొందించిన ఈప్లూటో 7జీని ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆటోమోటివ్‌ టెక్నాలజీ (ఐక్యాట్‌) ధృవీకరించిందని ప్యూర్‌ ఈవీ  ఎండీ గార్గి పచాల్‌ అన్నారు. అంతేకాదు ఒక్కసారి చార్జ్‌ చేస్తే గంటకు 60 కిలోమీటర్ల గరిష్ట వేగంతో 116 కిలోమీటర్లు ప్రయాణించగలదు. గంటకు 0-40 కిలోమీటర్ల వేగాన్ని కేవలం ఐదు సెకన్ల లోపే అందుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ దర రూ. 79,999

Updated Date - 2021-04-05T06:01:04+05:30 IST