రోహిత్ను బంతితో కొట్టిన షా.. తిట్టిపోస్తున్న నెటిజన్లు!
ABN , First Publish Date - 2021-01-16T03:27:34+05:30 IST
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని వల్ల భారత బ్యాట్స్మెన్ పృథ్వీ షాను నెటిజన్లు తిట్టి పోస్తున్నారు.
బ్రిస్బేన్: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని వల్ల భారత బ్యాట్స్మెన్ పృథ్వీ షాను నెటిజన్లు తిట్టి పోస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ మ్యాచ్లో సబ్స్టిట్యూట్గా పృథ్వీ షా ఫీల్డింగ్కు వచ్చాడు. ఆ సమయంలో అతను వేసిన ఓ త్రో.. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ చేతి వేళ్లకు కొంచెం గట్టిగా తగిలింది. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ను క్రికెట్ ఆస్ట్రేలియా.. తన ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. అంతే నెటిజన్లు షాపై మండి పడుతున్నారు. ఆడుతున్న 11మందిలో స్థానం కోసం షా ఎత్తులు అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. మరో యూజర్ అయితే.. ‘‘నేనే ఆడను.. ఎవర్నీ ఆడనివ్వను.. అంటూ రోహిత్కు చెప్తున్న షా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై సదరు ఆటగాళ్లు ఇంకా స్పందించలేదు. ఏది ఏమైనా ఈ పొరబాటు వల్ల, దీనిపై వచ్చే ట్రోలింగ్ వల్ల షాకు కొన్ని రోజులు నిద్ర దూరమైనట్లేనని కొందరు అంటున్నారు.