మానసిక ఒత్తిడిని అధిగమించాలి: వినోద్కుమార్
ABN , First Publish Date - 2021-11-26T08:58:37+05:30 IST
సమాజంలోని చాలామంది ప్రజలు మానసిక వ్యాధుల బారిన పడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు.
హైదరాబాద్ సిటీ, నవంబర్ 25 (ఆంధ్రజ్యోతి): సమాజంలోని చాలామంది ప్రజలు మానసిక వ్యాధుల బారిన పడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. మానసిక ఒత్తిడిని ఎలా అధిగమించాలన్న అంశాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. నగరంలోని అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ కామన్వెల్త్ ఎడ్యుకేషనల్ మీడియా సెంటర్ ఫర్ ఆసియా (సీఈఎంసీఏ)తో రూపొందించిన స్ర్టెస్ మేనేజ్మెంట్ ఆన్లైన్ కోర్సును గురువారం వర్సిటీలో వినోద్కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితులు, కొవిడ్ సమస్యలు ప్రజలను విపరీతమైన ఒత్తిడికి గురిచేస్తున్నాయన్నారు. తద్వారా గుండె సంబంధ వ్యాధులు, రక్తపోటు, ఇతర మానసిక రోగాలు వస్తున్నాయని చెప్పారు.