సెల్ఫోన్ వాడొద్దన్నారని విద్యార్థిని ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-12-18T17:30:49+05:30 IST
సెల్ఫోన్ వాడొద్దన్నారని విద్యార్థిని ఆత్మహత్య
చెన్నై : పులియాంగుడిలో సెల్ఫోన్ వాడకం తగ్గించాలని తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన ప్లస్ వన్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తెన్కాశి జిల్లా పులియాంగుడి నీర్పాయిచ్చిమాడన్ ఆలయ వీధికి చెందిన పులవేంద్రన్ అదే ప్రాంతం లో చిల్లర దుకాణం నడుపుతున్నాడు. అతనికి రాధ అనే భార్య, సెల్వి (15) అనే కుమార్తె ఉన్నారు. సెల్లి పులియాంగుడిలోని ఓ పాఠశాలలో ప్లస్ వన్ చదువుతోంది.
ప్రస్తుతం ఆన్లైన్ తరగతుల కోసం సెల్వికి తండ్రి కొత్త సెల్ఫోన్ కొనిచ్చాడు. తరగతులు పూర్తయిన తర్వాత కూడా సెల్వి ఎక్కువగా సెల్ఫోన్ వినియోగిస్తుండడాన్ని గమనించిన తండ్రి కుమార్తెను మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె బుధవారం రాత్రి తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పులియాంగుడి పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.