కృష్ణానగర్లో విద్యార్థిని అదృశ్యం
ABN , First Publish Date - 2020-12-25T13:42:11+05:30 IST
విద్యార్థిని అదృశ్యమైంది.
హైదరాబాద్/బంజారాహిల్స్ : విద్యార్థిని అదృశ్యమైంది. కృష్ణానగర్కు చెందిన వి.రాజేశ్వరి భర్త, కుమార్తె మానస(16), కుమారుడు సంతోష్ కుమార్లతో నివాసముంటుంది. కొద్ది రోజుల క్రితం గడ్డెపెల్లి శ్రీసాయినాథ్తో పరిచయం అయింది. భద్రాచలంలో లడ్డూల తయారీ పని ఇప్పిస్తానని చెప్పిన సాయినాథ్ రాజేశ్వరిని ఆమె ఇద్దరు పిల్లలను భద్రాచలం తీసుకెళ్లాడు. నెల రోజుల పాటు అందరూ అక్కడే ఉన్నారు. ఈ నెల 1న సాయినాథ్ నగరానికి వస్తుండడంతో అతనితో రాజేశ్వరి తన ఇద్దరు పిల్లలను పంపించింది. ఈ నెల 2న వారు కృష్ణానగర్లో ఇంటికి చేరుకున్నారు. మరుసటి రోజు సాయినాథ్ మానసను తీసుకొని బయటకు వెళ్లాడు. తిరిగి రాలేదు. వారి అచూకీ లభించకపోవడంతో రాజేశ్వరి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది.