అనంతపురంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తల ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2021-11-19T23:12:58+05:30 IST
అనంతపురంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తల ఆత్మహత్యాయత్నం
అనంతపురం: అనంతపురంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. టీడీపీ కార్యకర్తలు బంగినాథ, విశ్వేశ్వరనాయుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. పరిస్థితి విషమించడంతో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ ఘటన జరిగింది. చంద్రబాబు కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు తెలుస్తోంది.