విద్యార్థినిపై లాఠీ ఛార్జ్ చేయడం దారుణం: సుంకర పద్మశ్రీ

ABN , First Publish Date - 2021-11-08T19:25:29+05:30 IST

అనంతపురంలో ఎస్‌ఎస్‌బి‌యన్ ఎయిడెడ్ కళాశాల విద్యార్ధులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంపై మహిళా కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యార్థినిపై లాఠీ ఛార్జ్ చేయడం దారుణం: సుంకర పద్మశ్రీ

అమరావతి: అనంతపురంలో ఎస్‌ఎస్‌బి‌యన్ ఎయిడెడ్ కళాశాల విద్యార్ధులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంపై మహిళా కాంగ్రెస్ నేత  సుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినిపై లాఠీ ఛార్జ్ చేయడం దారుణమన్నారు. విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు బుగ్గిపాలైపోతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిడెడ్ కళాశాల ఫ్రైవేటీకరణ ఆపాలని నిరసన తెలపడం తప్పా? అని ఆమె ప్రశ్నించారు. ఏపీలో నియంత పాలన కొనసాగుతోందన్నారు. 

Updated Date - 2021-11-08T19:25:29+05:30 IST