పీఎం ఆత్మనిర్భర్‌ కింద సూర్యోదయ్ బ్యాంక్ తొలి రుణ మంజూరు

ABN , First Publish Date - 2020-10-12T22:27:48+05:30 IST

వేగంగా వృద్ధి చెందుతున్న చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులలో ఒకటైన సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ (ఎస్‌ఎస్‌ఎఫ్‌బీ) నేడు పీఎం ఎస్‌వీఏ నిధి పథకం కింద తమ మొట్టమొదటి ఋణాన్ని...

పీఎం ఆత్మనిర్భర్‌ కింద సూర్యోదయ్ బ్యాంక్ తొలి రుణ మంజూరు

హైదరాబాద్: వేగంగా వృద్ధి చెందుతున్న చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులలో ఒకటైన సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ (ఎస్‌ఎస్‌ఎఫ్‌బీ) నేడు పీఎం ఎస్‌వీఏ నిధి పథకం కింద తమ మొట్టమొదటి ఋణాన్ని  మంజూరు చేసినట్లు వెల్లడించింది. ఈ పథకం కింద 10,000 రూపాయల ఋణాన్ని కూరగాయల వ్యాపారి శ్రీమతి ఆశా అశోక్‌ వాల్మీకీకి అందజేశారు. ఈ ఋణ ప్రక్రియ మొత్తాన్నీ డిజిటల్‌గా, ఎలాంటి క్లిష్టత లేకుండా ఉండే రీతిలో బ్యాంక్‌ తీర్చిదిద్దింది. (ఎస్‌ఎస్‌ఎఫ్‌బీ) ఎండీ, సీఈవో ఆర్ భాస్కర్ బాబు మాట్లాడుతూ, పీఎం ఎస్‌వీఏ నిధి పథకం కింద వీధి వ్యాపారులకు చిన్న మొత్తంలో మూలధన ఋణాలను అండిస్తున్నామని, పీఎం లక్ష్యానికి అనుగుణంగా ఈ ఋణాలను అందించడాన్ని గర్వంగా భావిస్తున్నామని అన్నారు. ఈ ఋణాల ద్వారా ఆత్మనిర్భర్‌ పథకానికి చేయుతగా ఉండాలని అనుకుంటున్నట్లు చెప్పారు. 


ప్రారంభమైన నాటి నుంచి సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ స్థిరంగా ఆర్ధిక ఉత్పత్తులను అభివృద్ధి చేస్తూనే తమ సేవలను అందిస్తోంది. బ్యాంకింగ్‌ రంగానికి దూరంగా ఉన్న రంగాలకు తగిన సేవలను అందిస్తూనే, పలు పొదుపు, పెట్టుబడి అవకాశాలను గురించి వారికి అవగాహన కల్పిస్తోంది. అదే సమయంలో పలు ప్రభుత్వ భీమా పథకాలు, డిజిటల్‌ బ్యాంకింగ్‌  మార్గాలనూ విస్తరిస్తోంది. ప్రస్తుతం ఎస్‌ఎస్‌ఎఫ్‌బీ డిపాజిట్లు 300 కోట్ల రూపాయలుగా ఉంటే గ్రాస్‌లోన్‌ పోర్ట్‌ఫోలియో 3700 కోట్ల రూపాయలుగా ఉంది.


పరిశ్రమలో అత్యంత సరసమైన వడ్డీరేట్లను ఎస్‌ఎస్‌ఎఫ్‌బీ అందిస్తుంది. ప్రస్తుతం, సేవింగ్స్‌ ఖాతాలపై 0.25% వడ్డీ అందిస్తుంటే, ఎఫ్‌డీలపై వినియోగదారులకు 7.5% వడ్డీని అందిస్తోంది. సీనియర్‌ సిటిజన్ల కోసం మరింత ఎక్కువగా 8% వడ్డీ రేటును అందుబాటులో ఉంచింది.

Updated Date - 2020-10-12T22:27:48+05:30 IST