ప్రియుడు మోసగించాడని యువతి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-01-05T04:54:05+05:30 IST
ప్రియుడు మోసం చేయడంతో జీవితంపై విరక్తి చెందిన ఓ యువతి పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం జగన్నాథతండలో సోమవారం జరిగింది
కామేపల్లి, జనవరి 4: ప్రియుడు మోసం చేయడంతో జీవితంపై విరక్తి చెందిన ఓ యువతి పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం జగన్నాథతండలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం జుజురతండా కు చెందిన బానోత్ మీనాక్షి(18) అదే గ్రామానికి చెందిన ధారావత్ శ్రవణ్ ప్రేమించుకున్నారు. కానీ పెళ్లి విషయా నికి వచ్చే సరికి యువకుడు నిరాకరించడంతో ఇటీవల పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి హెచ్చరించారు. కానీ అతడు మాట వినకపోవడంతో.. మీనాక్షి మనోవేదన కు గురైంది. ఈ క్రమంలో కొంత ఊపశమనం కలుగు తుందని భావించిన యువతి కుటుంబసభ్యులు ఆమెను కామేపల్లి మండలం జగన్నాథతండాలోని బంధువైన ఉపేందర్ ఇంటికి పంపారు. కానీ శ్రావణ్ తనను పెళ్ళి చేసుకోనని తేల్చి చెప్పిన విషయాన్ని జీర్ణించుకోలేకపోయి న మీనాక్షి... ఈ నెల 2న బంధువుల ఇంట్లోనే పురుగులమందు తాగింది. దీంతో ఆమెను ఖమ్మం ఆసుపత్రికి తరలించడగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. ఈ ఘటనపై యువతి తండ్రి రమేష్ సోమవారం కామేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్నామని ఎస్ఐ స్రవంతి తెలిపారు.