రాష్ట్రంలో మాఫియా రాజ్యమేలుతోంది: ఎల్. రమణ

ABN , First Publish Date - 2021-02-23T21:33:57+05:30 IST

రాష్ట్రంలో ల్యాండ్, డ్రగ్, శాండ్ మాఫియా రాజ్యమేలుతోందని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్.

రాష్ట్రంలో మాఫియా రాజ్యమేలుతోంది: ఎల్. రమణ

హైదరాబాద్: రాష్ట్రంలో ల్యాండ్, డ్రగ్, శాండ్ మాఫియా రాజ్యమేలుతోందని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్. రమణ ఆరోపించారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల స్థానానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ తరపున రమణ నామినేషన్ వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా జరిగే ఎన్నికలు ఇవని ఆయన అన్నారు. తనను గెలిపిస్తే  వివిధ వర్గాల సమస్యలను మండలిలో వినిపిస్తానని ఆయన పేర్కొన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేశానని రమణ తెలిపారు. తాను 27 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నానని ఆయన పేర్కొన్నారు. అందరూ తనకు ఓటు వేయాలని ఆయన కోరారు. టీడీపీ ప్రభుత్వంలోనే మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైద్రాబాద్ జిల్లాలు అభివృద్ధి చెందాయని ఆయన పేర్కొన్నారు. 



ఉద్యోగాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదని ఆయన అన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ, డీఏ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. కోవిడ్ సమయంలో ప్రజలను గాలికి వదిలేసారని ప్రభుత్వాలపై ఆయన విరుచుకుపడ్డారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే అన్ని సమస్యలను పరిష్కరిస్తానని రమణ హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-02-23T21:33:57+05:30 IST