లంక బోణీ
ABN , First Publish Date - 2021-10-19T07:45:58+05:30 IST
ఛేదన ఆరంభంలో కొంత తడబడినా ఆ తర్వాత పుంజుకొన్న మాజీ చాంపియన్ శ్రీలంక.. టీ20 వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో నమీబియాను 7 వికెట్ల తేడాతో మట్టికరిపించింది.
నమీబియా పరాజయం
అబుధాబి: ఛేదన ఆరంభంలో కొంత తడబడినా ఆ తర్వాత పుంజుకొన్న మాజీ చాంపియన్ శ్రీలంక.. టీ20 వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో నమీబియాను 7 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. గ్రూప్-ఎలో సోమవారం జరిగిన మరో మ్యాచ్లో లంక బౌలర్ల ధాటికి.. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 19.3 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. క్రెయిగ్ విలియమ్స్ (29) టాప్ స్కోరర్. మహీష్ తీక్షణ మూడు వికెట్లు పడగొట్టగా.. లాహిరు కుమార, హసరంగ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఛేదనలో లంక 13.3 ఓవర్లలో 100/3 పరుగులు చేసి నెగ్గింది. భనుక రాజపక్సే (42), అవిష్క ఫెర్నాండో (30) నాలుగో వికెట్కు 74 పరుగుల అజేయ భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు.
నమీబియా: 19.3 ఓవర్లలో 96 ఆలౌట్ (విలియమ్స్ 29, ఎరాస్మన్ 20; మహీష్ తీక్షణ 3/25, లాహిరు కుమార 2/9).
శ్రీలంక: 13.3 ఓవర్లలో 100/3 (రాజపక్సే 42 నాటౌట్, ఫెర్నాండో 30 నాటౌట్; స్మిత్ 1/7).