రాష్ట్ర ఆర్చరీ పోటీల్లో ఖమ్మం క్రీడాకారుల ప్రతిభ

ABN , First Publish Date - 2021-03-02T05:34:12+05:30 IST

రాష్ట్ర ఆర్చరీ పోటీల్లో ఖమ్మం క్రీడాకారుల ప్రతిభ

రాష్ట్ర ఆర్చరీ పోటీల్లో ఖమ్మం క్రీడాకారుల ప్రతిభ

స్వర్ణ, కాంస్య పతకాలతో జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

ఖమ్మం స్పోర్ట్స్‌, మార్చి 1: హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలలో ఖమ్మం నగరంలోని సర్ధార్‌ పటేల్‌ స్టేడియం క్రీడాకారులు జి.నగేష్‌, సాయి నిఖిల్‌లు ప్రతిభ చూపి పతకాలు సాధించారు. పోటీలో నగేష్‌ స్వర్ణ పతకం సాధించగా, సాయి నిఖిల్‌ కాంస్య పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన క్రీడాకారులను డీవైఎస్‌వో పరంధామరెడ్డి అభినందించారు.

Updated Date - 2021-03-02T05:34:12+05:30 IST