నాగార్జునుడు నడియాడిన నేలను టీఆర్ఎస్ అపవిత్రం చేస్తోంది: తరుణ్చుగ్
ABN , First Publish Date - 2021-04-11T19:23:23+05:30 IST
నాగార్జునుడు నడియాడిన నేలను టీఆర్ఎస్ అపవిత్రం చేస్తోందని బీజేపీ ఇన్చార్జ్ తరుణ్ చుగ్ ధ్వజమెత్తారు.
హైదరాబాద్: నాగార్జునుడు నడియాడిన నేలను టీఆర్ఎస్ అపవిత్రం చేస్తోందని బీజేపీ ఇన్చార్జ్ తరుణ్ చుగ్ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సాగర్లో టీఆర్ఎస్ లెగ్, పెగ్ సంస్కృతిని తీసుకొస్తోందని దుయ్యబట్టారు. డబ్బు, మద్యంతో ప్రజలను టీఆర్ఎస్ మభ్యపెడుతోందన్నారు. ఎంఐఎం రేవ్ పార్టీలు నిర్వహిస్తోందన్నారు. డ్రగ్స్ కేసులో ఉన్న నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు.. వైఎస్ షర్మిలకు పార్టీ పెట్టుకొనే హక్కు ఉందని తరుణ్చుగ్ అన్నారు.
అంతకుముందు తరుణ్చుగ్తో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశమయ్యారు. సాగర్లో తాజా రాజకీయ పరిస్థితిని తరుణ్చుగ్కు సంజయ్ వివరించినట్లు చెబుతున్నారు. ఐదు రోజుల పాటు తరుణ్ చుగ్ సాగర్లో మకాం వేయనున్నారు. ప్రచారం చివరిదశలో అనుసరించాల్సిన వ్యూహంపై తరుణ్చుగ్ దిశానిర్దేశం చేశారు.