సంక్షేమ నిధుల మళ్లింపు దుర్మార్గం: టీడీపీ
ABN , First Publish Date - 2021-08-02T07:58:48+05:30 IST
సంక్షేమ నిధుల మళ్లింపు దుర్మార్గం: టీడీపీ
బీసీ కార్పొరేషన్ల నుంచి వేల కోట్లు దారి మళ్లించి, బీసీల అభివృద్ధిని జగన్రెడ్డి ప్రశ్నార్థకం చేశారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. 2019-20లో రూ.10,478 వేల కోట్లు, 2020-21లో రూ.23,458 కోట్లు, 2021-22లో రూ.25 వేల కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు. బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం, బీసీ సంక్షేమ నిధుల మళ్లింపు, స్వయం ఉపాధి రుణాలు రద్దు తదితర అంశాలపై ఆదివారం ఆయన సీఎంకు లేఖ రాశారు. వృద్ధులు, వితంతువులకు ఇచ్చే పింఛన్ సొమ్మును రూ.3 వేలకు పెంచుతామని నమ్మించి, మోసం చేయడానికి జగన్కు ఎలా మనసొప్పిందని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు దారి మళ్లించిన జగన్రెడ్డి నిజమైన దళిత ద్రోహి అని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు విమర్శించారు.