‘ప్రజాస్వామ్యం ఉందో.. లేదో.. అర్ధం కావడం లేదు’

ABN , First Publish Date - 2020-11-22T17:05:10+05:30 IST

‘ప్రజాస్వామ్యం ఉందో.. లేదో.. అర్ధం కావడం లేదు’

‘ప్రజాస్వామ్యం ఉందో.. లేదో.. అర్ధం కావడం లేదు’

విజయవాడ: వైసీపీకి పోలవరం నిర్మాణంపై చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి చినరాజప్ప అన్నారు. టీడీపీ హయాంలోనే పోలవరం పనులు 70శాతం పూర్తయ్యాయని గుర్తుచేశారు. పోలవరం ఎత్తు తగ్గించడంతో పాటు ప్రాజెక్ట్ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారన్న ఆందోళన ప్రజల్లో ఉందన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వానికి వైఎస్సార్ విగ్రహం పెట్టడం పట్ల ఉన్న శ్రద్ధ ప్రాజెక్ట్‌పై లేదని మండిపడ్డారు. పోలవరం పరిరక్షణ యాత్ర చేపట్టిన సీపీఐ నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం దారుణమన్నారు. అసలు ఏపీలో ప్రజాస్వామ్యం ఉందో.. లేదో.. అర్ధం కావడం లేదన్నారు.

Updated Date - 2020-11-22T17:05:10+05:30 IST