విజయవాడ పోలీసులపై న్యాయ పోరాటం చేస్తాం: బోండా ఉమ
ABN , First Publish Date - 2020-09-30T00:20:05+05:30 IST
విజయవాడ పోలీసులపై న్యాయ పోరాటం చేస్తాం: బోండా ఉమ
విజయవాడ: శాంతియుత నిరసన కార్యక్రమాలను అడ్డుకుంటున్న విజయవాడ పోలీసులపై న్యాయ పోరాటం చేస్తామని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే హక్కు పోలీసులకు ఎక్కడిది? అని ప్రశ్నించారు. నార్త్జోన్ పోలీసులకు స్పీడ్ పోస్ట్ ద్వారా నోటీసులు పంపించామన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజాసమస్యలపై శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.