సంస్థాగత ప్రక్షాళనకు టీడీపీ శ్రీకారం

ABN , First Publish Date - 2020-09-27T09:05:31+05:30 IST

సంస్థాగత ప్రక్షాళనకు టీడీపీ నడుం బిగించింది...

సంస్థాగత ప్రక్షాళనకు టీడీపీ శ్రీకారం

కొత్తగా పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీలు 


అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): సంస్థాగత ప్రక్షాళనకు టీడీపీ నడుం బిగించింది. దీనిలో భాగంగా కొత్త కమిటీల ఏర్పాటుతోపాటు అనేక మంది నేతలకు కొత్త బాధ్యతలు అప్పగించనుంది. సంస్థాగత పునర్నిర్మాణం లో భాగంగా కొత్తగా మరో అంచెతో నూతన కమిటీలను ఏర్పాటు చేయాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఇప్పటివరకు జిల్లా కమిటీలు, వాటి కింద మండల కమిటీలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా పార్లమెంట్‌ నియోజకవర్గ కమిటీలు వస్తున్నాయి. మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాలకు 25 కమిటీలు వేయనున్నారు. జిల్లా కమిటీల మాదిరిగా వీటికి అధ్యక్షులు, పూర్తిస్థాయి కమిటీలు ఉంటాయి. ఇవి నేతల్లో ఉత్సాహాన్ని పెంచి, సంస్థాగతంగా బలపడతానికి దోహదం చేస్తాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Updated Date - 2020-09-27T09:05:31+05:30 IST