మంత్రి కన్నబాబు ప్రకటన దేనికో చెప్పాలి?: జవహర్

ABN , First Publish Date - 2021-11-17T00:35:05+05:30 IST

పదవీ కాలం ముగిసి పోతుందనే ఆందోళనలో మంత్రులున్నారని మాజీ మంత్రి జవహర్ అన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను గాలికొదిలేశారని మండిపడ్డారు.

మంత్రి కన్నబాబు ప్రకటన దేనికో చెప్పాలి?: జవహర్

అమరావతి: పదవీ కాలం ముగిసి పోతుందనే ఆందోళనలో మంత్రులున్నారని మాజీ మంత్రి జవహర్ అన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను గాలికొదిలేశారని మండిపడ్డారు. కోర్టులో కీలక విచారణ జరుగుతున్న సమయంలో రాజధానిపై మంత్రి కన్నబాబు ప్రకటన దేనికో చెప్పాలి? అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టడానికే భయపడే వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-11-17T00:35:05+05:30 IST