Chandrababuకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఖరారు
ABN , First Publish Date - 2021-10-23T18:41:54+05:30 IST
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అపాయింట్మెంట్ ఖరారైంది.
న్యూఢిల్లీ: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అపాయింట్మెంట్ ఖరారైంది. దీంతో సోమవారం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ను టీడీపీ అధినేత కలవనున్నారు. రాష్ట్రంలో ఆర్టికల్ 356 ప్రయోగించాలని కోవింద్కు చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రపతితో పాటు పలువురు కేంద్ర పెద్దలను చంద్రబాబు బృందం కలవనుంది.