దేవినేని ఉమాకు Corona పాజిటివ్
ABN , First Publish Date - 2022-01-18T14:59:23+05:30 IST
మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర్రావు కరోనా బారిన పడ్డారు.
అమరావతి: మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర్రావు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని దేవినేని ట్విట్టర్ వేదికగా నిర్ధారించారు. ‘‘నేను కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. డాక్టర్ల సలహా మేరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను’’ అంటూ దేవినేని ఉమా ట్వీట్ చేశారు.