రాధాపై రెక్కీ బాధాకరం: కళా వెంకట్రావు

ABN , First Publish Date - 2021-12-31T01:05:30+05:30 IST

విజయవాడ నగరంలో టీడీపీ నేత వంగవీటి రాధాపై రెక్కీ

రాధాపై రెక్కీ బాధాకరం: కళా వెంకట్రావు

అమరావతి: విజయవాడ నగరంలో టీడీపీ నేత వంగవీటి రాధాపై రెక్కీ నిర్వహించడం బాధాకరమని ఆ పార్టీ నాయకుడు కళా వెంకట్రావు అన్నారు. నిందితులను పట్టుకోకుండా వైసీపీ నేతలు కట్టుకథలు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. కొన్ని సామాజిక వర్గాలను రెచ్చగొట్టడానికే ఈ తతంగమన్నారు. తెచ్చిన రూ.6 లక్షల కోట్లు అప్పు ఏమైందో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కక్షలు, ముఠా తగాదాలు, కుల రాజకీయాలకు స్వస్తి పలకాలని ఆయన హితవు పలికారు. 

Updated Date - 2021-12-31T01:05:30+05:30 IST