విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండిస్తున్నాం: Lokesh

ABN , First Publish Date - 2021-11-08T17:37:28+05:30 IST

అనంతంలో ఎస్‌ఎస్‌బీఎన్ ఎయిడెడ్ కళాశాల వద్ద విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు.

విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండిస్తున్నాం: Lokesh

అమరావతి: అనంతంలో ఎస్‌ఎస్‌బీఎన్ ఎయిడెడ్ కళాశాల వద్ద విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయించడం, తలలు పగిలేలా కొట్టించడం జగన్‌రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య సహాయం అందించాలన్నారు. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలంటూ నిరసన తెలపడం కూడా రాజారెడ్డి రాజ్యాంగంలో నేరమేనా? అని ప్రశ్నించారు. విద్యార్థి ఉద్యమాలు అణిచి వేయాలని చూసిన ఎంతటి నియంత అయినా నేలకొరగడం ఖాయమని స్పష్టం చేశారు. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను ధ్వంసం చేసే నిర్ణయాలు వెంటనే వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి ఇచ్చిన జీఓలు రద్దు చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-11-08T17:37:28+05:30 IST