మద్యం వల్లే ఏపీలో కరోనా వ్యాప్తి: నిమ్మల

ABN , First Publish Date - 2020-09-26T19:46:18+05:30 IST

మద్యాన్ని నిత్యావసర వస్తువుగా ప్రభుత్వం వ్యాపారం చేయడం వల్లే కరోనా వ్యాప్తి జరుగుతుందని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

మద్యం వల్లే ఏపీలో కరోనా వ్యాప్తి: నిమ్మల

ఏలూరు: మద్యాన్ని నిత్యావసర వస్తువుగా ప్రభుత్వం వ్యాపారం చేయడం వల్లే కరోనా వ్యాప్తి జరుగుతుందని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. మద్యంపై జే టాక్స్ ద్వారా ప్రభుత్వం కంటే జగన్‌కే రెట్టింపు ఆదాయం వస్తుందని ఆరోపించారు. అనామక కంపెనీల నాసిరకం మద్యంతో పేదల ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. రాష్ట్రంలో పిచ్చి బ్రాండ్లు, అనామక మద్యంతో తాళిబొట్లు తెగుతున్నా జగన్‌కు లెక్క లేదన్నారు. సంవత్సరానికి 20 శాతం మద్యం దుకాణాలు తగ్గిస్తానన్న జగన్ ఎందుకు నేడు మాట తప్పారు? మద్యపాన నిషేధంపై మీ కపట నాటకాలు, కొంగ జపాలు కట్టిపెట్టి మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2020-09-26T19:46:18+05:30 IST