సీఎం జగన్‌తో టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ భేటీ

ABN , First Publish Date - 2020-09-19T18:33:57+05:30 IST

సీఎం జగన్‍తో టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్‌ను వాసుపల్లి గణేష్ కలిశారు

సీఎం జగన్‌తో టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ భేటీ

అమరావతి: సీఎం జగన్‍తో టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్‌ను వాసుపల్లి గణేష్ కలిశారు. ఎంపీ విజయసాయిరెడ్డి.. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ను సీఎం జగన్ దగ్గరకు తీసుకొచ్చారు. 


వాసుపల్లి గణేశ్‌కుమార్‌.. తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు, విశాఖ దక్షిణం నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. చాలా కాలంగా ఆయన పార్టీ మారతారని ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ ఎప్పుడూ బయట పడలేదు. తన వ్యాపార అవసరాల రీత్యా ఆయన వైసీపీకి దగ్గర కావాలని ప్రచారం జరిగింది. ఇందులో భాగంగానే గత కొద్దికాలంగా ఆయన టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన వైసీపీ మద్దతుదారునిగా కొనసాగనున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. వాసుపల్లి గణేష్ కుమారుడు మాత్రమే వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.

Updated Date - 2020-09-19T18:33:57+05:30 IST