గుండ్లకమ్మ గేట్లు పరిశీలించిన టీడీపీ బృందం

ABN , First Publish Date - 2022-09-06T09:40:29+05:30 IST

గుండ్లకమ్మ గేట్లు పరిశీలించిన టీడీపీ బృందం

గుండ్లకమ్మ గేట్లు పరిశీలించిన టీడీపీ బృందం

ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ


ఒంగోలు, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్మోతి): ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ గేట్లు దెబ్బతిని ప్రాజెక్టులోని మూడు టీఎంసీల నీరు సముద్రంపాలు కావడానికి నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమని టీడీపీ ఎమ్మెల్యేలు డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి, ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. తక్షణం పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. గుండ్లకమ్మ జలాశయాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్యనేతలు సోమవారం సందర్శించారు. గుండ్లకమ్మ గేట్లు, నీరు లేక వెలవెలపోతున్న జలశయాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల నిర్వహణపై వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. గుండ్లకమ్మ దెబ్బతినడానికి గత ప్రభుత్వం, నాటి సీఎం చంద్రబాబు కారణమని మంత్రి అంబటి చెప్పడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు గడుస్తున్నా ప్రాజెక్టు నిర్వహణ, గేట్ల మరమ్మతులు ఏమాత్రం పట్టించుకోకుండా చంద్రబాబుపై ఆరోపణలు చేయడాన్ని ఖండించారు.

Updated Date - 2022-09-06T09:40:29+05:30 IST