ఆసుపత్రికి హాకీ ఆటగాళ్ల తరలింపు

ABN , First Publish Date - 2020-08-13T09:21:54+05:30 IST

కరోనా బారిన పడిన ఆరుగురు టీమిండియా హాకీ ఆటగాళ్ల ఆరోగ్యంపై భారత క్రీడాప్రాధికార సంస్థ ప్రత్యేక దృష్టిపెట్టింది...

ఆసుపత్రికి హాకీ ఆటగాళ్ల తరలింపు

బెంగళూరు: కరోనా బారిన పడిన ఆరుగురు టీమిండియా హాకీ ఆటగాళ్ల ఆరోగ్యంపై భారత క్రీడాప్రాధికార సంస్థ ప్రత్యేక దృష్టిపెట్టింది. రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి తగ్గడంతో స్ట్రయికర్‌ మన్‌దీ్‌ప సింగ్‌ను సోమవారం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు పాజిటివ్‌గా తేలిన కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌, సురేందర్‌ కుమార్‌, జస్కరణ్‌ సింగ్‌, వరుణ్‌ కుమార్‌, కృష్ణ బహదూర్‌ను కూడా ముందు జాగ్రత్తగా బుధవారం అదే ఆసుపత్రిలో చేర్చారు. వీరందరికీ మెరుగైన వైద్య అందించనున్నట్టు సాయ్‌ అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-08-13T09:21:54+05:30 IST