టెక్ మహీంద్రా లాభంలో 39% వృద్ధి
ABN , First Publish Date - 2021-07-30T05:48:35+05:30 IST
ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా జూన్తో ముగిసిన త్రైమాసికంలో రూ.10,197.60 కోట్ల ఆదాయంపై
న్యూఢిల్లీ : ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా జూన్తో ముగిసిన త్రైమాసికంలో రూ.10,197.60 కోట్ల ఆదాయంపై రూ.1,350.20 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే ఆదాయం 12 శాతం, లాభం 39.2 శాతం పెరిగింది. జూన్ చివరి నాటికి కంపెనీలో 1,26,263 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. మార్చి త్రైమాసికంతో పోల్చితే ఉద్యోగుల సంఖ్య 5209 పెరిగింది. చేతిలో రూ.181.12 కోట్ల డాలర్ల నగదు నిల్వలున్నాయి.