తీన్మార్ మల్లన్నపై కేసు
ABN , First Publish Date - 2021-08-07T01:51:45+05:30 IST
ఓ యువతి ఫిర్యాదుతో చింతపండు నవీన్కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్: ఓ యువతి ఫిర్యాదుతో చింతపండు నవీన్కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల మల్లన్నకు చెందిన యూట్యూబ్ ఛానల్లో సోదాలు నిర్వహించి హార్డ్ డిస్కులు ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీస్స్టేషన్లో విచారణకు హాజరు కావాలని మల్లన్నకు నోటీసులు జారీ చేశారు. అయితే శుక్రవారం హాజరవుతారని అందరూ భావించినప్పటికీ ఆయన గైర్హాజరయ్యారు. తాను జ్వరంతో బాధ పడుతున్నానని, పరీక్ష చేయించుకునేందుకు ఆసుపత్రికి వెళ్తున్నానని విచారణకు హాజరు కాలేనని పోలీసులకు సమాచారం అందించారు. ఈ లోగా మల్లన్న కోర్టును ఆశ్రయించారు. విచారణ పేరుతో తనను పోలీసులు ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని, సైబర్ క్రైమ్ పోలీసులిచ్చిన నోటీస్ను రద్దు చేయాలని కోర్టును కోరినట్లు సమాచారం.