ఈఎస్ఐ మెడికల్ స్కామ్లో ఈడీ దూకుడు.. కోట్ల విలువైన ఆస్తుల అటాచ్
ABN , First Publish Date - 2021-11-23T23:30:56+05:30 IST
ఈఎస్ఐ మెడికల్ స్కామ్లో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఈ స్కామ్ నిందితులకు సంబంధించిన రూ.144 కోట్లు, 131 ఆస్తులను ..
హైదరాబాద్: ఈఎస్ఐ మెడికల్ స్కామ్లో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఈ స్కామ్ నిందితులకు సంబంధించిన రూ.144 కోట్లు, 131 ఆస్తులను అటాచ్ చేశారు. హైదరాబాద్, బెంగళూరు, నోయిడా, చెన్నైలోని 97 ఫ్లాట్స్, 6 విల్లాలు, 18 కమర్షియల్ షాపులను కూడా అటాచ్ చేశారు. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి, శ్రీహరిబాబు, రాజేశ్వరిరెడ్డి, పద్మ, ఫార్మసిస్ట్ నాగలక్ష్మి ఆస్తులను జప్తు చేశారు. మనీలాండరింగ్ యాక్ట్ 200 ప్రకారం ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు.