సంక్షేమంలో తెలంగాణ దేశానికే దిక్సూచి

ABN , First Publish Date - 2021-11-30T05:08:14+05:30 IST

సంక్షేమంలో తెలంగాణ దేశానికే దిక్సూచి

సంక్షేమంలో తెలంగాణ దేశానికే దిక్సూచి
ధాన్యం తూకం చేస్తున్న ఎమ్మెల్యే ఆనంద్‌

ధారూరు: రైతుల సంక్షేమంలో భారతదేశానికే తెలంగాణ దిక్సూచిగా మారిందని వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ తెలిపారు. ధారూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డు, దోర్నాల్‌లో సోమవారం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌ రైతులకు ఉచిత కరెంటు, సాగునీరు, రైతుబంధు, బీమా వంటి రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండ ధాన్యం డబ్బులను వారి ఖాతాల్లో జమచేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, వైస్‌ ఎంపీపీ విజయ్‌, సర్పంచ్‌లు చంద్రమౌళి, సుజాత, మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ సంతో్‌షకుమార్‌, వైస్‌చైర్మన్‌ అ ంజయ్య, పీఎసీఎస్‌ చైర్మన్‌ వై.సత్యనారాయణరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాజునాయక్‌, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు వీరేశం, వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-11-30T05:08:14+05:30 IST