పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై తెలంగాణ సర్కార్ అధ్యయనం
ABN , First Publish Date - 2021-11-06T20:32:54+05:30 IST
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై తెలంగాణ సర్కార్ అధ్యయనం చేస్తోంది.
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై తెలంగాణ సర్కార్ అధ్యయనం చేస్తోంది. వెంటనే ధరలు తగ్గించే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో రాష్ట్ర ఆదాయానికి గండి పడుతుందని, కేంద్ర నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల వందకోట్ల ఆదాయం కోల్పోనున్నందని చెబుతున్నారు.
కేంద్రం కొంతమేర బ్రేకులు వేస్తే బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్ తగ్గింపుతో వినియోగదారులకు మరింత ఉపసమనాన్ని ఇస్తున్నాయి. ఏపీ, తెలంగాణ సహా బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఎంత ఒత్తిడి ఉన్నా పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను తగ్గించేది లేదని తెలంగాణ ప్రభుత్వం అంటోంది.