తెలంగాణలో కరోనా ఉధృతి.. గత 24 గంటల్లో..

ABN , First Publish Date - 2020-08-02T03:17:49+05:30 IST

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తెలంగాణలో గత 24 గంటల్లో 2,083 కరోనా కేసులు...

తెలంగాణలో కరోనా ఉధృతి.. గత 24 గంటల్లో..

హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తెలంగాణలో గత 24 గంటల్లో 2,083 కరోనా కేసులు నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనాతో 11మంది మృతి చెందినట్లు పేర్కొంది. దీంతో.. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 64,786కి చేరగా, మరణాల సంఖ్య 530కి చేరింది. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 24 గంటల వ్యవధిలో 578 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.


ఇక.. మిగతా జిల్లాల విషయానికొస్తే.. ఆదిలాబాద్‌-17, భద్రాద్రి కొత్తగూడెం-35, జగిత్యాల-21, జనగాం-21, జయశంకర్‌ భూపాలజిల్లా-24, జోగులాంబ గద్వాల-38, కామారెడ్డి-18, కరీంనగర్‌-108, ఖమ్మం-32, కొమురంభీం ఆసిఫాబాద్‌-8, మహబూబ్ నగర్-31, మహబూబాద్‌-40, మంచిర్యాల-37, మెదక్‌-16, మేడ్చల్‌-197, ములుగు-19,నాగర్‌ కర్నూల్‌-18, నల్లగొండ-48, నారాయణపేట-9, నిర్మల్‌-25, నిజామాబాద్‌-73, పెద్దపల్లి-42, రాజన్నసిరిసిల్ల-39, రంగారెడ్డి-228, సంగారెడ్డి-101, సిద్దిపేట-16, సూర్యాపేట-34, వికారాబాద్‌-21, వనపర్తి-9, వరంగల్‌రూరల్-39, వరంగల్‌ అర్బన్‌-134, యాదాద్రి భువనగిరి జిల్లాలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ప్రభుత్వం తెలిపింది.

Updated Date - 2020-08-02T03:17:49+05:30 IST